ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు

 ఐఏఎస్ అరవింద్ కుమార్ కు  ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. జూన్ 25న బుధవారం ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.  జులై 1 విచారణకు హజరు కావాలని ఆదేశించింది.  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇటీవల ఏసీబీ రెండోసారి విచారించిన సంగతి తెలిసిందే.విచారణ అనంతరం వచ్చిన సమాచారం మేరకు ఐఏఎస్ అరవింద్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం అరవింద్ కుమార్  కుమార్తె కాన్వకేషన్ కోసం యూరప్ వెళ్లారు .  జూన్ 30 వరకు లీవ్ లో ఉన్నారు.  ఈ క్రమంలోనే జులై 1న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఏసీబీ. 

ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డితో పాటు ఈ కార్ రేస్ నిర్వాహకులను ఏసీబీ ప్రశ్నించింది. అప్పట్లో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. 

►ALSO READ | N Sridhar: ఇరిగేషన్ శాఖలో ఒక మామూలు ఈఈ 150 కోట్లు సంపాదించాడు !

బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫార్ములా – ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కో సిస్టర్ కంపెనీ ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9,10,11,12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ కల్పించే విధంగా అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 11న సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9 నిర్వహించారు. వివిధ కారణాల చేత ఏస్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ, ఫార్ములా – ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈవోకు చెల్లించాల్సిన రూ.45.71 కోట్లు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎంఏయూడీ చెల్లించింది