పోలీస్ స్టేషన్లోనే లంచం.. ఏసీబీకి పట్టుబడిన కానిస్టేబుల్

పోలీస్ స్టేషన్లోనే లంచం.. ఏసీబీకి పట్టుబడిన కానిస్టేబుల్

అది పోలీస్ స్టేషన్.. ఏకంగా అక్కడే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ కానిస్టేబుల్. ముందుగా సమాచారం అందటంతో.. పోలీస్ స్టేషన్ లోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఖమ్మం సిటీలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్స్ జరిగాయి. హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బూర్ల రామారావు, విష్ణు, విజయ్ ఈ ముగ్గురిపై CRPC 41 Sec నోటీసు ఇవ్వడానికి.... కోటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ రూ. 50 వేలు లంచం అడిగాడు. అయితే 2024 జనవరి 29న వారిని డబ్బు తీసుకురమ్మని చెప్పాడు.. అయితే వారు ముందుగా అనుకున్న విధంగా ఏసీబీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. పథకం ప్రకారం హెడ్ కానిస్టేబుల్ కు డబ్బులు ఇవ్వడానికి ఈరోజు(జనవరి 29) ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే కానిస్టేబుల్ కు లంచం ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా హెడ్ కానిస్టేబుల్ ని పట్టుకున్నారు. 

దీంతో అక్కడ ఉన్నవారంతా అవ్వాక్కయ్యారు. ఇదేంటే పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకోవడం ఏంటని సహ ఉద్యోగులు విమర్శించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.