ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్న అధికారులు

  ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్న అధికారులు

అక్రమాస్తుల కేసులో అరెస్టైన సిటీ సెంట్రల్‌‌ క్రైమ్‌‌స్టేషన్ (సీసీఎస్​) ఏసీపీ ఉమా మహేశ్వరరావును  కాసేపట్లో  ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు ఏసీబీ అధికారులు.  నిన్న ఉమా మహేశ్వరరావుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మొత్తం 14 చోట్ల సోదాలు ఈ దాడులు కొనసాగాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ డాడుల్లో మూడు కోట్ల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు 38 లక్షలు,  60 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులు ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరుకి చెందిన ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు1995 బ్యాచ్ ఎస్‌‌‌‌ఐ. సిటీ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ కాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అబిడ్స్‌‌‌‌ పీఎస్‌‌‌‌లో విధులు నిర్వర్తించారు. ఓ కేసు దర్యాప్తులో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. రాచకొండ కమిషనరేట్‌‌‌‌పరిధి జవహర్‌‌‌‌‌‌‌‌నగర్ పీఎస్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. పీఎస్‌‌‌‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ బాధిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, సస్పెన్షన్​కు గురయ్యారు. 

ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీగా విధులు నిర్వహించారు. ఇక్కడ కూడా సివిల్ వివాదాల్లో తలదూర్చారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఉమామహేశ్వర్ రావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సిటీ కమిషనరేట్‌‌‌‌పరిధిలోని సీసీఎస్‌‌‌‌లో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.