ఖమ్మం సభకు బయలుదేరిన షర్మిల కాన్వాయ్‌కు ఆక్సిడెంట్

ఖమ్మం సభకు బయలుదేరిన షర్మిల కాన్వాయ్‌కు ఆక్సిడెంట్

ఖమ్మం సభకు బయలుదేరిన షర్మిల కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టదలచుకున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్‌లో సంకల్ప సభకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం షర్మిల లోటస్ పాండ్ నుంచి ఉదయం 8 గంటలకు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా కాన్వాయ్‌లోనే ఉన్నారు. అయితే వీరంతా బయలుదేరిన కాసేపటికే ఎల్‌బీ నగర్ ఫ్లైఓవర్ వద్ద షర్మిల కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ హానీ జరగకపోయినా.. కార్లు మాత్రం దెబ్బతిన్నాయి. దాంతో మిగతా కార్లలో వారు సభకు బయలుదేరారు.