హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని బుధవారం పేర్కొంది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా గార్లలో అత్యధికంగా 7.4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మెదక్లో 6.5, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో 6.4, మెదక్ జిల్లా శంకరంపేటలో 6.3, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 5.9, ఖమ్మం జిల్లా కారేపల్లిలో 5.8 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.