ధరణి వల్లే భూతగాదాలు : వంశీకృష్ణ

ధరణి వల్లే భూతగాదాలు : వంశీకృష్ణ

అచ్చంపేట :వెలుగు: ధరణి పోర్టల్ లో సమస్యల వల్లే భూ తగాధాలు వస్తున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం అచ్చంపేట అంబేద్కర్ ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజావాణిలో మొదటి దరఖాస్తును మన్ననూర్ గురుకుల పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన నికిత కుటుంబం నుంచి తీసుకున్నారు. వారి కుటుంబానికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

ప్రజావాణికి దాదాపు 200 మంది వచ్చారు. ఎమ్మెల్యేకు వివిధ సమస్యలపై దరఖాస్తులను ఇచ్చారు. వచ్చే వారం నుంచి అన్ని శాఖల అధికారులు ఈ హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, అమ్రాబాద్ ఎంపీపీ శ్రీనివాసులు, కౌన్సిలర్ గౌరీ శంకర్ ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.