యూపీలో మరో దారుణం : ముగ్గురు అమ్మాయిలపై యాసిడ్ దాడి

యూపీలో మరో దారుణం : ముగ్గురు అమ్మాయిలపై యాసిడ్ దాడి

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ముగ్గురు అమ్మాయిలపై దుండుగులు యాసిడ్ పోశారు. గోండా జిల్లా పర్సాపూర్ లో ఈ ఘటన జరిగింది. అమ్మాయిలు ఇంటిలో పడుకుని ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యాసిడ్ పోశారని.. వారి తండ్రి చెప్పారు. రాత్రి ఒకటిన్నర సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. నిచ్చెన సాయంతో గోడ ఎక్కి.. దుండగులు ఇంటిలోకి ప్రవేశించారన్నారు. వారు ఎవరనేది మాత్రం ఇప్పటికీ తెలియడం లేదన్నారు.  ఇక..గాయపడిన ముగ్గురు అమ్మాయిల ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.