![కేసీఆర్.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ : షబ్బీర్ అలీ](https://static.v6velugu.com/uploads/2024/05/52_36mqbaT1ok.jpg)
కామారెడ్డి, వెలుగు: కేసీఆర్ తన కూతురు కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని, క్యాడర్ ను , ప్రజల నమ్మకాన్ని బీజేపీకి అమ్మేశారని ఆయన విమర్శించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియాతో షబ్బీర్ అలీ మాట్లాడారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, సెక్యులరిజంపై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని గత కొద్ది రోజులుగా తాము చెబుతున్నామని, తాజా ఎన్నికల్లో అది నిజమని నిరూపణ అయ్యిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీకి 11 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ఇటీవల కామారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి సమస్యలపై వినతిపత్రం ఇచ్చానని తెలిపారు.