సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల.. అమలుకై చిత్తశుద్ధితో పనిచేస్తున్నం : వాసిరెడ్డి సీతారామయ్య

సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల.. అమలుకై చిత్తశుద్ధితో పనిచేస్తున్నం :  వాసిరెడ్డి సీతారామయ్య
  • సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య
  • శ్రీరాంపూర్​లో యూనియన్​ ముఖ్య కార్యకర్తల సమావేశం

కోల్​బెల్ట్​/నస్పూర్​వెలుగు: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చిత్తశుద్దితో పనిచేస్తుందని యూనియన్​ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.ఆదివారం శ్రీరాంపూర్​ ఏరియా సీసీసీలోని నర్సయ్య భవన్​లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం(ఏఐటీయూసీ) ముఖ్య కార్యకర్తల సమావేశం, మందమర్రిలోని యూనియన్​ ఆఫీస్​లో జరిగిన మీడియా సమావేశాల్లో  జనరల్​ సెక్రటరీ కొరిమి రాజ్​కుమార్​తో కలిసి పాల్గొన్నారు.   

సింగరేణి కార్మికుల  సొంతింటి పథకం,పెర్క్స్​పై ఐటీ యాజమాన్యం చెల్లింపు అంశాలపై స్ర్టక్చర్డ్​ కమిటీ మీటింగ్​లో మాట్లాడామని,వీటి పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. మైనింగ్​స్టాఫ్​,ట్రేడ్స్​మెన్​ మెడికల్​ ఆన్​ఫిట్​ అయితే వారికి సర్పేస్​లో సూటబూల్​ జాబ్​ ఇప్పించామని, డిపెండెంట్​ ఉద్యోగాల వయోపరిమితి 35 నుంచి 40ఏళ్లకు పెంచామన్నారు. 

కార్మికులకు సూపర్​ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే డిమాండ్​తో యాజమాన్యం హైదరాబాద్​లో ఆసుపత్రి నిర్మాణానికి ఒప్పుకుందని.. త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు.  సింగరేణి సంస్థ మనుగడ కోసం రాష్ట్ర సర్కార్​ రావాల్సిన రూ.45వేల కోట్ల విద్యుత్తు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

 సింగరేణిలో  ప్రభుత్వ  జోక్యం పెరిగిందని, సమస్యల పరిష్కారానికి ఇన్​ఛార్జీ సీఎండీ ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారని పేర్కొన్నారు  ఈనెల 18న సీపీఐ శతజయంతి ఉత్సవాలు, ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో సింగరేణియులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ,సీపీఐ లీడర్లతో కలిసి ఏఐటీయూసీ నూతన సంవత్సర క్యాలెడర్లను ఆవిష్కరించారు.సమావేశాల్లో సీపీఐ రాష్ట్ర నేత కలవేన శంకర్​, ఏఐటీయూసీ కేంద్ర కమిటీ లీడర్లు ఎండి.అక్బర్​అలీ,వీరభద్రయ్య,ముస్కె సమ్మయ్య,శ్రీరాంపూర్​,మందమర్రి పాల్గొన్నారు.