‘ఇండియన్ 2’ ప్రమాద బాధితులకు రూ. కోటి చెక్కులిచ్చిన కమల్ హాసన్

‘ఇండియన్ 2’ ప్రమాద బాధితులకు రూ. కోటి చెక్కులిచ్చిన కమల్ హాసన్

‘ఇండియన్ 2’ సినిమా సెట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కమల్ హాసన్ ఒక్కొక్కరికి కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇండియన్ 2’సినిమా కోసం వేసిన సెట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరణించిన మరియు గాయపడిన వారిందరి కుటుంబాలకు కలిపి డైరక్టర్ శంకర్ తో కలిసి రూ. 4 కోట్ల రూపాయలను కమల్ హాసన్ అందజేశారు.

ఆ ప్రమాదంలో మరణించిన కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్), చంద్రన్ (ఆర్ట్ అసిస్టెంట్), మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్)లకు చెందిన ఒక్కొక్కరి కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు ఇచ్చారు. తీవ్ర గాయాలైన లైట్‌మ్యాన్‌కు పరిహారంగా రూ .90 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా.. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన వారికి కూడా రూ .10 లక్షలు కేటాయించారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో దర్శకుడు మరియు నేను కూడా ఇక్కడే ఉన్నాం. ఆ ప్రమాదం మాకే జరిగి ఉంటే ఎలా? అది మనలో ఎవరికైనా జరగవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత మాకు ఉంది. ప్రమాదం జరిగిన వారం తరువాత బాధితులకు ఏం చేయాలో చర్చించడానికి మేమందరం కలుసుకున్నాం. కానీ, కరోనా కారణంగా ఆ తర్వాత మళ్ళీ కలసుకోలేకపోయాం’ అని అన్నారు.

‘ఫిబ్రవరి 19న చెన్నైలోని పూనమల్లెలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ‘ఇండియన్ 2’కోసం వేసిన సెట్లో ఒక ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా భారీ లైటింగ్ పరికరాలతో కూడిన ఒక భారీ క్రేన్ కూలిపోయింది. క్రేన్ కూలిన ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నందున కమల్ తప్పించుకున్నాడు’ అని డైరక్టర్ శంకర్ తెలిపాడు. షూటింగుకు సంబంధించి ప్రతి సభ్యునికి భీమా కల్పించాలని నిర్మాతలను ఆయన డిమాండ్ చేశారు.

శంకర్ దర్శకత్వంలో 1996లో విడుదలయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు.

For More News..

వీడియో పోస్ట్ చేసి మరో నటి ఆత్మహత్య

కొత్త విద్యావిధానం గురించి అపోహలు, అనుమానాలు వద్దు

అభిమానులకు మహేష్ బాబు ట్వీట్