సీసీటీవీ ఫుటేజీ ఇస్తే.. దునియాకు నిజాలు చూపిస్తాం

సీసీటీవీ ఫుటేజీ ఇస్తే.. దునియాకు నిజాలు చూపిస్తాం

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎలక్షన్‌‌పై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోమారు కామెంట్ చేశారు. ఎన్నిక జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఎలక్షన్ రోజు సీసీటీవీ వీడియో ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఈసీ కృష్ణ మోహన్‌ను కోరారు. దీంతో కృష్ణ మోహన్ ప్రకాశ్ రాజ్‌‌కు సీసీటీవీ ఫుటేజీని చూపించారు. కానీ సగం వరకే చూసిన ప్రకాశ్ రాజ్.. మిగిలిన వీడియోను తర్వాత చూస్తామన్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన ట్వీట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీని తమకు ఇవ్వాలని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ మోహన్‌ను కోరిన ప్రకాశ్ రాజ్.. ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ప్రపంచానికి చూపుతామన్నారు. ఇది కేవలం ప్రారంభమేనన్నారు. ఈ ట్వీట్‌కు ‘మా’ ఎన్నిక నాటి ఫొటోలను జత చేశారు. ఈ ఫొటోల్లో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు పక్కన ఓ నూకల సాంబశివరావు అనే వ్యక్తిని చూడొచ్చు. అదే వ్యక్తి వైసీపీ కండువాతో జగన్ పక్కన ఉండటాన్ని కూడా గమనించొచ్చు. ఆ వ్యక్తిపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ కేసులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు సదరు కంప్లయింట్ కాపీని ఆయన ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

పాక్‌తో మ్యాచ్‌‎కు టీమిండియాలో వీళ్లు ఉండాల్సిందే 

ఫేస్‌బుక్ లైవ్ పెట్టి భర్త సూసైడ్ అటెంప్ట్

మెరుపులా కదిలి మహిళ ప్రాణాలు కాపాడింది