మరోసారి రెచ్చిపోనున్న 3 ఇడియట్స్.. సీక్వెల్ కు రంగం సిద్ధం?

మరోసారి రెచ్చిపోనున్న 3 ఇడియట్స్.. సీక్వెల్ కు రంగం సిద్ధం?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Raj kumar hirani) తెరకెక్కించిన "3 ఇడియట్స్(3 idiots)" గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్(Aamir khan), మాధవన్(Madhavan), శర్మన్ జోషి(Sharman joshi), కరీనా కపూర్‌(Kareena kapoor) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సమాజంలోని విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపిస్తూ రాజ్ కుమార్ తెరకెక్కించిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ సినిమాకు ఆడియన్స్ ఫిదా ఐపోయారు.          

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 3 ఇడియట్స్ నిర్మాతలు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబందించిన హింట్ కూడా ఇచ్చారు 3 ఇడియట్స్ నటుడు జోషి.. "మేము గతంలో జరిగిన కొన్ని విషయాలను తరచుగా గుర్తుచేసుకుంటాం. వాటిని మేము ఎప్పటికీ మర్చిపోలేం. 3 ఇడియట్స్ మూవీ సీక్వెల్ పై రాజ్‌ కుమార్ హిరానీకి  కూడా చాలా ఆసక్తి ఉంది. ఆయన ఏ విషయంలోనూ రాజీపడరు. అందుకే.. 3 ఇడియట్స్ సీక్వెల్ విషయంలో కూడా ముందడుగు వేస్తారనే మేము ఆశిస్తున్నాం" అంటూ హింట్ ఇచ్చారు జోషి.

ఇక శర్మన్ జోషి ఇచ్చిన ఈ చిన్న హింట్ తో 3 ఇడియట్స్ సీక్వెల్(3 Idiots sequel) పై అభిమానుల్లో ఆశలు చిగురించాయి. నిజానికి ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుండు అని చాలా మందే అనుకున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న ఈ న్యూస్ తో 3 ఇడియట్స్  అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ సీక్వెల్ 3 ఇడియట్స్ మూవీ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా అనేది చూడాలి.