డ్రగ్స్ కేసులో హీరో శ్రీరాం విచారణ : ఆ పొలిటికల్ పార్టీ లీడర్ కూ లింక్స్

డ్రగ్స్ కేసులో హీరో శ్రీరాం విచారణ : ఆ పొలిటికల్ పార్టీ లీడర్ కూ లింక్స్

చెన్నై డ్రగ్స్ కేసులో ఊహించని మలుపు. హీరో శ్రీరాం.. అదేనండీ వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీలో నటించిన నటుడు శ్రీరాం.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. ఇంతకీ చెన్నై డ్రగ్స్ కేసులో యాక్టర్ శ్రీరాం పాత్ర ఏంటీ.. ఎందుకు ఈ  కేసులో లింక్ అయ్యి ఉన్నాడో చూద్దాం..

కొన్నాళ్ల క్రితం ఓ బారులో గొడవ జరిగింది. ఈ వివాదంలో చెన్నై సిటీ నున్నంబాగం ఏరియాలోని మైలాపూర్ ప్రాంతానికి చెందిన ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఐటీ వింగ్ సభ్యులు ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయటం.. డ్రగ్స్ సరఫరాలో ప్రసాద్ కు లింక్స్ ఉన్నాయని బయటపడింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో ఎంక్వయిరీ చేయగా.. నిందితుడు ప్రసాద్ నుంచి యాక్టర్ శ్రీరాంకు డ్రగ్స్ సరఫరా అయినట్లు సమాచారం వచ్చింది. 

►ALSO READ | Theatre Movies: ఈ వారం (జూన్ 27) థియేటర్ సినిమాలివే.. తెలుగులో కన్నప్పతో పాటు క్రైమ్ థ్రిల్లర్స్

ఈ డ్రగ్స్ కేసులో దర్యాప్తులో భాగంగా.. జూన్ 23వ తేదీన యాక్టర్ శ్రీరాంను విచారించారు పోలీసులు. శ్రీరాం డ్రగ్స్ తీసుకున్నాడా లేదా.. ప్రసాద్ నుంచి ఎన్ని సార్లు కొనుగోలు చేశాడు.. డ్రగ్స్ వినియోగించాడా లేదా.. శ్రీరాం నుంచి ఇంకా ఎవరికైనా డ్రగ్స్ వెళ్లాయా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు చెన్నై పోలీసులు. విచారణలో భాగంగా శ్రీరాంకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.. అతని బ్లడ్ శాంపిల్స్ సేకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చెన్నై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. విచారణ కొనసాగుతుందని అని మాత్రమే చెబుతున్నారు.