తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..జాన్వీ కపూర్..శిఖ‌ర ప‌హారియా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..జాన్వీ కపూర్..శిఖ‌ర ప‌హారియా

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఇవాళ (జనవరి 5న )తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది జాన్వీ. రంగనాయకుల మండపంలో..వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అంద చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన జాన్వీ కపూర్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. జాన్వీ కపూర్కి వెంట చిన్ననాటి స్నేహితుడైన శిఖ‌ర ప‌హారియా (Shikarpahariya) తో పాటు అలనాటి హీరోయిన్ మహేశ్వరి కూడా ఉంది. 

జాన్వీ.. శిఖ‌ర ప‌హారియా రీసెంట్ గా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ టెంపుల్ని విజిట్ చేశారు. అక్కడ వీరిద్దరూ కలిసి ప్రార్థనలు చేసి ఆరతి పూజలో జంటగా పాల్గొన్నారు. ఇక ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం కొరకు రావడంతో..ఈ జంట త్వరలో ఏడు అడుగులు వేయడానికి సిద్దపడ్డట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

తరచూ తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటూనే ఉంటారు. ఆమెకు తిరుపతి బాలాజీ అంటే ఎంతో ఇష్టం. అంతే కాదు ఇప్పటికీ చాలామార్లు జాన్వీ తిరుమల దర్శనానికి వచ్చారు. ప్రస్తుతం జాన్వీ తిరుమల వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది 

జాన్వీ సినిమాల విషయానికి వస్తే..ఎన్టీఆర్ దేవరలో పల్లెటూరి పడుచులా కనిపిస్తోన్న పోస్టర్ రిలీజ్ అయ్యాక..వేయి కళ్ళతో వెయిట్ చేస్తూ..కళ్ళల్లో ఒత్తులేసుకుంటున్నారు ఫ్యాన్స్. త్వరలో దేవర టీజర్ రిలీజ్ కాబోతుంది. జాన్వీ ఎలా కనిపిస్తుందో చూడాలి.