- గ్లోబల్ కంపెనీల నుంచి రూ.9,500 కోట్ల సేకరణ
- కంపెనీ విలువ రూ.1.80 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అదానీ ఎయిర్పోర్ట్స్ సుమారు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,500 కోట్లు) ట్టుబడులను సమీకరించడం ద్వారా ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా నిలిచింది. టెమాసెక్, బ్లాక్రాక్, ఆల్ఫా వేవ్ గ్లోబల్తో పాటు ప్రేమ్జీ ఇన్వెస్ట్ సంస్థలు నిధులు అందించాయి.
ఈ పెట్టుబడులకు ముందు అదానీ ఎయిర్పోర్ట్స్ విలువ 18 బిలియన్ డాలర్లు కాగా, కొత్త మూలధనంతో మొత్తం విలువ 19 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.1.80 లక్షల కోట్లు) చేరింది. ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా ఎదిగింది.
స్పెయిన్కు చెందిన ఏనా, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ థాయిలాండ్ 1, 2 స్థానాల్లో ఉన్నాయి. ఈ నిధులతో విమానాశ్రయాల ఆధునీకరణ చేపట్టి వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని 20 కోట్లకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ముంబైతో కలిపి 8 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ ఎయిర్పోర్ట్స్కు, దేశీయ విమాన ప్రయాణికులలో 25 శాతం, కార్గో రవాణాలో 33 శాతం వాటా ఉంది.
