జూబ్లీహిల్స్, వెలుగు: పెళ్లయిన 4 నెలలకే ఓ యువతి సూసైడ్చేసుకుంది. భర్త వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ముద్దం నాగలక్ష్మి(18)కి ఈ ఏడాది ఏప్రిల్ 26న మాదగాని శేఖర్తో వివాహం జరిగింది. తర్వాత దంపతులు బంజారాహిల్స్లోని సుఖ్దేవ్నగర్ లో ఉంటున్నారు.
కాగా, నాగలక్ష్మి తనకు ఇష్టం లేదంటూ శేఖర్ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని నాగలక్ష్మి తన పుట్టింటివారికి చెప్పుకొని ఏడ్చింది. ఈ క్రమంలో బుధవారం ఆమె ఉరేసుకుంది. కుటుంబసభ్యులు నిమ్స్ హాసిటల్కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. భర్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ముద్దం నాగయ్య బంజారాహిల్స్ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
