న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ మరోసారి బాండ్స్ బైబ్యాక్ చేపడుతోంది. 2024 లో తిరిగి చెల్లించాల్సిన 195 మిలియన్ డాలర్ల విలువైన బాండ్స్ను తన వద్ద ఉన్న నగదు నిల్వలతో బై బ్యాక్ చేయనున్నట్టు ప్రకటించింది. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ఆరోపణల తర్వాత ఇన్వెస్టర్ల నమ్మకం పెంచుకునేందుకు అదానీ గ్రూప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మొత్తం చెల్లించాల్సిన బాండ్స్ 520 మిలియన్ డాలర్లని, తాజా బైబ్యాక్ను మినహాయిస్తే ఇంకా 325 మిలియన్ డాలర్లు మిగిలి ఉంటుందని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ఒకసారి 130 మిలియన్ డాలర్ల విలువైన బాండ్స్ బ్యాక్ను కంపెనీ చేపట్టింది. బాండ్స్ బైబ్యాక్ కోసం తెచ్చిన టెండర్ అక్టోబర్ 26 దాకా ఓపెన్లో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.