అదానీ విల్మార్​ నష్టం రూ.79 కోట్లు

అదానీ విల్మార్​ నష్టం రూ.79 కోట్లు

న్యూఢిల్లీ: వంట నూనెలు తయారు చేసే అదానీ విల్మార్​ ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో రూ.79 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ధరలు తగ్గడం వల్లే నష్టాలు వచ్చాయని కంపెనీ ప్రకటించింది. అదానీ విల్మార్​ 2022 జూన్​ క్వార్టర్​లో రూ.194 కోట్ల లాభం సంపాదించింది. ఇదే కాలంలో మొత్తం ఆదాయం 12 శాతం తగ్గి రూ.12,928 కోట్లు తగ్గింది. గత జూన్​లో దీనికి రూ.14,724 కోట్లు వచ్చాయి.  జూన్​ క్వార్టర్​లో అమ్మకాలు 25 శాతం పెరిగి 14.9 లక్షల టన్నులకు చేరుకున్నాయ కంపెనీ తెలిపింది.