
- అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తుండు: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హెచ్చరించారు. అరెస్టు భయంతో ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నారని, జైలుకెప్పుడు వెళ్లారని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కేటీఆర్ మాయ మాటలు చూస్తుంటే, ఆయనకు అరెస్టు భయం ఏ స్థాయిలో వెంటాడుతుందో అర్థమవుతుందన్నారు.
ఏసీబీ విచారణకు వెళ్తూ.. హీరోలా ఫోజులు ఇస్తుండని, కానీ ఈ కేసులో తానే దొంగ అనే విషయం కేటీఆర్ కూడా తెలుసన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్, కేటీఆర్ను తరిమికొడితే పోయి ఫాం హౌస్లో పడ్డారని విమర్శించారు.