రాజ్యాధికారం కోసం కొట్లాడతామన్నారు... మలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్. 27 ఏళ్లుగా SC వర్గీకరణ సమస్య పరిష్కారం కావట్లేదన్నారు. దీని కోసం తాము ఎన్నిఏండ్లు కొట్లాడుకోవాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పెద్ద మాదిగో, చిన్న మాదిగో అర్థం కావడం లేదన్నారు. వర్గీకరణ సమస్యతో మాలలు వెనుకబడుతున్నారన్నారు. హైదరాబాద్ తూముకుంట లో..మాల మహనాడు 16 వ వార్షికోత్సవం తోపాటు.. జాతీయ మొదటి ప్లీనరీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ఆకునూరి మురళి, మల్లెపల్లి లక్ష్మయ్య తోపాటు బెల్లయ్య నాయక్ మీటింగ్ లో పాల్గొన్నారు.