9 జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు

9 జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు సీఎస్​ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. 2021 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్​ అధికారి రాధికా గుప్తాను హన్మకొండకు,  పి. శ్రీజను ములుగుకు, ఫైజాన్ అహ్మద్ ను  నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, పి.గౌతమిని  రాజన్న సిరిసిల్లకు, పర్మార్ పింకేశ్ కుమార్ లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​ను జనగాంకు, లెనిన్ వత్సల్ టోప్పోను మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు , శివేంద్ర ప్రతాప్ ను  మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, సంచిత్ గంగ్వార్ ను వనపర్తికి, 2020 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్​కధిరవన్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్​గా ప్రభుత్వం అపాయింట్ చేసింది.