హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. 2021 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి రాధికా గుప్తాను హన్మకొండకు, పి. శ్రీజను ములుగుకు, ఫైజాన్ అహ్మద్ ను నిర్మల్కు, పి.గౌతమిని రాజన్న సిరిసిల్లకు, పర్మార్ పింకేశ్ కుమార్ లలిత్కుమార్ను జనగాంకు, లెనిన్ వత్సల్ టోప్పోను మహబూబాబాద్ కు , శివేంద్ర ప్రతాప్ ను మహబూబ్నగర్కు, సంచిత్ గంగ్వార్ ను వనపర్తికి, 2020 బ్యాచ్కు చెందిన ఐఏఎస్కధిరవన్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ప్రభుత్వం అపాయింట్ చేసింది.