యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది సాయికుమార్‌‌‌‌

యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది సాయికుమార్‌‌‌‌

వరుస సినిమాల్లో నటిస్తున్న ఆది సాయికుమార్‌‌‌‌.. త్వరలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతను హీరోగా కె.శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టాప్‌‌ గేర్’. రియా సుమన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల దర్శకుడు మారుతి లాంచ్ చేసిన టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ లభించింది. 

తాజాగా ట్రైలర్‌‌‌‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. ఈనెల 30న సినిమా విడుదల చేయనున్నారు. అలాగే ట్రైలర్‌‌‌‌ను ఈనెల 18న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. అన్నిరకాల కమర్షియల్‌‌ ఎలిమెంట్స్‌‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందంటున్నారు మేకర్స్. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.