
ఆసిఫాబాద్/ బజార్హత్నూర్/ కోల్బెల్ట్/ నస్పూర్/జైపూర్, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ పిలుపునిచ్చారు. స్వగ్రామమైన బజార్హత్నూర్ మండలం జాతర్లలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మొక్కలు నాటారు. మాజీ జడ్పీటీసీ తాటిపల్లి రాజు, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, మాజీ సర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అంతా కృషి చేయాలని శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల సింగరేణి జీఎంలు ఎం. శ్రీనివాస్, జి.దేవేందర్ పిలుపునిచ్చారు. జీఎం కార్యాలయాల ఆవరణలో ఆఫీసర్లు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదాం అనే నినాదంతో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే7 గని కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. నిర్మల్లో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్అభిలాష అభివన్ క్యాంప్ ఆఫీస్లో మొక్కలు నాటారు.