
అడివి శేష్ నటించిన హిట్ చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి. ఈ స్పై థ్రిల్లర్ విడుదలై జులై 3కి ఆరేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దీనికి సీక్వెల్గా తెరకెక్కుతున్న ‘జీ 2’ నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ని రివీల్ చేశారు. ఇందులో ఆరు స్టైలిష్ యాక్షన్ లుక్స్తో శేష్ ఇంప్రెస్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే నలభై శాతం పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు.
వచ్చే ఏడాది సెకండాఫ్లో పాన్ ఇండియా వైడ్గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శేష్ కథను అందించాడు. ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రేక్షకులకు మ్యాసీవ్ విజువల్ ట్రీట్ ఇస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.