పలు కాలేజీల్లో అడ్మిషన్స్: అప్లైయ్ చేసుకోవడానికి చివరి తేదీలు…

పలు కాలేజీల్లో అడ్మిషన్స్: అప్లైయ్ చేసుకోవడానికి చివరి తేదీలు…

రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్

న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్​.. స్కూల్స్‌‌, కాలేజీల్లోని ప్రతిభ కలిగిన విద్యార్థులకు మెరిట్​ స్కాలర్​షిప్స్​ అందించేందుకు ప్రకటన విడుదల చేసింది. సంస్కృత విద్యా అభివృద్ధిలో భాగంగా వీటిని అందిస్తున్నారు. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: సంస్కృతం, పాలి, ప్రాకృత భాషలను మెయిన్​ లేదా ఆప్షనల్​ సబ్జెక్టుగా చదువుతున్న తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్​డీ వరకు విద్యార్థులు అర్హులు. దరఖాస్తు విధానం: సంస్కృతం, పాలి, ప్రాకృత భాషలను బోధిస్తున్న ఇన్​స్టిట్యూట్స్​ ముందుగా ఆన్​లైన్‌‌లో తమ కాలేజ్​ లేదా స్కూల్​ పేరును నమోదు చేసుకోవాలి. అవి యాక్టివేట్​ అయిన తర్వాత స్టూడెంట్స్​ అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరితేది: 2019 అక్టోబర్​ 20 (ఇన్​స్టిట్యూట్స్), అక్టోబర్​ 30 (విద్యార్థులు); వివరాలకు: www.scholarship.rsks.in, www.sanskrit.nic.in

నిమ్హాన్స్​​లో పీహెచ్డీ

నేష‌‌న‌‌ల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌‌ల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌‌–బెంగళూరు) 2019–20 విద్యాసంవత్సరానికి బ‌‌యోస్టాటిస్టిక్స్‌‌, క్లినిక‌‌ల్ న్యూరోసైన్సెస్‌‌, మెంట‌‌ల్ హెల్త్ రిహాబిలిటేష‌‌న్, న్యూరాల‌‌జీ, న్యూరోఇమేజింగ్ & ఇంట‌‌ర్వెన్షన‌‌ల్‌‌ రేడియాల‌‌జీ తదితర విభాగాల్లో పీహెచ్​డీ, పీడీఎఫ్​ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 51 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లు: పీహెచ్‌‌డీ–10, సూప‌‌ర్ స్పెషాలిటీ–13, పోస్ట్ డాక్టోర‌‌ల్ ఫెలోషిప్‌‌–9, ఎండీ–19; అర్హత‌‌: ఆయా సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్‌‌, ఇంట‌‌ర్న్‌‌షిప్‌‌, పీజీ, పీహెచ్​డీ, పోస్ట్ డాక్టోర‌‌ల్ ఫెలోషిప్ ఉత్తీర్ణత‌‌  కలిగి ఉండాలి. ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1500, ఎస్సీ, ఎస్టీల‌‌కు రూ.1000. పీడ‌‌బ్ల్యూడీల‌‌కు ఫీజు లేదు. సెలెక్షన్​ ప్రాసెస్: ఆన్​లైన్​ టెస్ట్​, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌రితేది: 2019 సెప్టెంబర్​ 16; పరీక్షతేది: 2019 అక్టోబర్​ 20; వివరాలకు: www.nimhans.ac.in

అగ్రిబిజినెస్ మేనేజ్‌‌మెంట్

నేష‌‌న‌‌ల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌‌ల్చర‌‌ల్ ఎక్స్​టెన్షన్ మేనేజ్‌‌మెంట్​ (ఎన్​ఏఏఆర్​ఎం)  2020–22 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌‌మెంట్ (అగ్రి–బిజినెస్ మేనేజ్‌‌మెంట్‌‌) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిల‌‌ర్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌. సెలెక్షన్​ ప్రాసెస్​: క్యాట్‌‌ 2019 స్కోర్​, గ్రూప్ డిస్కష‌‌న్‌‌, ఇంట‌‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 31; వివరాలకు: www.manage.gov.in

ఫైర్ సేఫ్టీలో డిప్లొమా

హైదరాబాద్​లోని నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ (ఎన్​సీఎఫ్​ఎస్​ఈ) వివిధ ఫైర్​ సేఫ్టీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులు: డిప్లొమా ఇన్​ ఆక్యుపేషనల్​ సేఫ్టీ, హెల్త్​ అండ్ ఎన్విరాన్​మెంటల్​ మేనేజ్​మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్​ ఆక్యుపేషనల్​ సేఫ్టీ, హెల్త్​ అండ్ ఎన్విరాన్​మెంటల్​ మేనేజ్​మెంట్, డిప్లొమా ఇన్​ ఫైర్​ టెక్నాలజీ, ఇండస్ర్టియల్​ సేఫ్టీ ఆపరేషన్​,   డిప్లొమా ఇన్​ ఇండస్ర్టియల్​ సేఫ్టీ, సర్టిఫికెట్​ కోర్స్​ ఇన్​ ఫైర్‌‌‌‌మన్​, సర్టిఫికెట్ కోర్స్​ ఇన్​ ఫైర్​ ఆఫీసర్ అండ్​ సబ్​ ఆఫీసర్ తదితరాలు. అర్హత: కోర్సును బట్టి ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్​తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. చివరితేది: 2019 సెప్టెంబర్​ 9; కాంటాక్ట్​ నంబర్​: 9701496748; వివరాలకు: www.ncttindia.com

అగ్రిబిజినెస్ మేనేజ్‌‌మెంట్

నేష‌‌న‌‌ల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌‌ల్చర‌‌ల్ ఎక్స్​టెన్షన్ మేనేజ్‌‌మెంట్​ (ఎన్​ఏఏఆర్​ఎం)  2020–22 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌‌మెంట్ (అగ్రి–బిజినెస్ మేనేజ్‌‌మెంట్‌‌) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిల‌‌ర్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌. సెలెక్షన్​ ప్రాసెస్​: క్యాట్‌‌ 2019 స్కోర్​, గ్రూప్ డిస్కష‌‌న్‌‌, ఇంట‌‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 31; వివరాలకు: www.manage.gov.in

ఐజీఎన్‌‌సీఏలో స‌‌ర్టిఫికెట్ కోర్సులు

ఇందిరాగాంధీ నేష‌‌న‌‌ల్ సెంట‌‌ర్ ఫ‌‌ర్ ది ఆర్ట్స్‌‌(ఐజీఎన్‌‌సీఏ–న్యూఢిల్లీ) 2019–20 విద్యా సంవ‌‌త్సరానికి వివిధ స‌‌ర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కోర్సుల కాలవ్యవధి మూడు నెలలు. ఆఫ్​లైన్​లో ఈమెయిల్​ ద్వారా అప్లై చేసుకోవాలి. కోర్సులు–సీట్లు: డాక్యుమెంట‌‌రీ అండ్ ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్‌‌మేకింగ్‌‌–25, స్ర్కీన్ రైటింగ్‌‌–25, ఫోక్​లోర్ అండ్ ఇంటాంజిబుల్ క‌‌ల్చర‌‌ల్ హెరిటేజ్‌‌–25, ఓపెన్ యాక్సెస్ ఫ‌‌ర్ లైబ్రేరియ‌‌న్స్‌‌–25, రీసెర్చ్ మెథ‌‌డాల‌‌జీ–25; అర్హత‌‌: ఏదైనా బ్యాచిలర్​ డిగ్రీ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్​ మెరిట్​​ఆధారంగా షార్ట్​లిస్ట్​ చేసి ఎంపిక చేస్తారు. చివ‌‌రితేది: 2019 సెప్టెంబర్​ 9; వివరాలకు: www.ignca.gov.in

ఎన్ఐబీఎంలో పీజీడీఎం

నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంక్​ మేనేజ్​మెంట్​ (ఎన్​ఐబీఎం–పుణె) పోస్ట్​ గ్రాడ్యుయేట్​ డిప్లొమా ఇన్​ మేనేజ్​మెంట్​ (బ్యాంకింగ్​ అండ్ ఫైనాన్షియల్​ సర్వీసెస్​) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత. CAT 2018 / XAT (2019) / CMAT (2019) లో వ్యాలిడ్​ స్కోర్​ కలిగి ఉండాలి. ఫీజు: రూ.1500; సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్​లిస్ట్​ చేసి ఎబిలిటీ టెస్ట్​, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరితేది: 2020 మార్చి 20; వివరాలకు: www.nibmindia.org

ఎన‌‌ర్జీ మేనేజ్‌‌మెంట్‌‌లో

నేష‌‌న‌‌ల్ ప్రొడ‌‌క్టివిటీ కౌన్సిల్ రీజినల్​ సెంటర్​, చెన్నైలోని డాక్టర్​ బి.ఆర్‌‌.అంబేద్కర్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొడ‌‌క్టివిటీ 2019–20 విద్యా సంవత్సరానికి పోస్ట్​ గ్రాడ్యుయేట్​ స‌‌ర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్​ ఎనర్జీ మేనేజ్​మెంట్​లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కాలవ్యవధి ఒక సంవత్సరం. ఆఫ్‌‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: నాలుగేళ్ల ఇంజినీరింగ్​ డిగ్రీ ఉత్తీర్ణత. వ‌‌య‌‌సు: 30 ఏళ్లకు మించకూడ‌‌దు. సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్​ మెరిట్, గేట్​ స్కోర్, ఇంటర్వ్యూ; చివ‌‌రితేది: 2019 సెప్టెంబర్​ 5; వివరాలకు: www.npcindia.gov.in

ఎన్‌‌పీటీఐలో పీజీడీఎం ప్రోగ్రామ్

మినిస్ర్టీ ఆఫ్​ పవర్​ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేష‌‌న‌‌ల్ ప‌‌వ‌‌ర్ ట్రైనింగ్ ఇన్‌‌స్టిట్యూట్  6 నెలల పోస్ట్​ గ్రాడ్యుయేట్ డిప్లొమా (ట్రాన్స్‌‌మిష‌‌న్ & డిస్ట్రిబ్యూష‌‌న్‌‌) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఆఫ్‌‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: ఎలక్ర్టికల్​/పవర్​/ఎలక్ర్టికల్​ అండ్​ ఎలక్ర్టానిక్స్​​ ఇంజినీరింగ్​ బ్రాంచ్​ల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌‌. సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌‌డ‌‌మిక్ మెరిట్; చివ‌‌రితేది: 2019 అక్టోబర్​ 4; వివరాలకు: www.npti.gov.in

ఎయిమ్స్‌‌, జోద్‌‌పూర్‌‌
రాజ‌‌స్థాన్‌‌లోని జోద్‌‌పూర్​లో ఉన్న ఆలిండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌‌) 2019–20 విద్యా సంవ‌‌త్సరానికి మాస్టర్ ఆఫ్ ప‌‌బ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్‌‌) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్లు: 15 (మెడిక‌‌ల్‌‌–7, నాన్‌‌మెడిక‌‌ల్–3, స్పాన్సర్డ్‌‌–5); అర్హత‌‌: ఎంబీబీఎస్‌‌/ బీడీఎస్‌‌/ ఆయుష్/బీఈ/ బీటెక్‌‌/ఎంఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఫీజు: జనరల్​, ఓబీసీలకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.800; సెలెక్షన్​ ప్రాసెస్: రిటన్​ టెస్ట్​, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌రితేది: 2019 అక్టోబర్​ 1;  ప‌‌రీక్షతేది: 2019 నవంబర్​ 7; వివరాలకు: www.aiimsjodhpur.edu.in