నవోదయలో ఆరో తరగతి -అడ్మిషన్స్​

నవోదయలో ఆరో తరగతి -అడ్మిషన్స్​

జవహర్‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌‌‌‌‌‌‌‌వీ) 2024-–25 విద్యా సంవత్సరానికి  ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్​ అయింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌‌‌‌‌‌‌‌వీలు ఉన్నాయి.  ఎంట్రెన్స్​ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.
అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-–24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. 
ఎగ్జామ్​: జవహర్‌‌‌‌‌‌‌‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌‌‌‌‌‌‌‌ ఎబిలిటీ, అర్థమెటిక్‌‌‌‌‌‌‌‌, లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌) ఉంటాయి. 
దరఖాస్తులు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సమాచారం కోసం www.cbseitms.rcil.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.