ఈ ఏడాది .. తగ్గిన పన్ను వసూళ్లు

ఈ ఏడాది .. తగ్గిన పన్ను వసూళ్లు

న్యూఢిల్లీ: ముందస్తు పన్ను వసూళ్లు మందగించడం,  ఎక్కువ రీఫండ్‌‌‌‌లు ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల విలువ 1.39 శాతం తగ్గి రూ.4.59 లక్షల కోట్లకు చేరుకున్నదని శనివారం కేంద్రం తెలిపింది. కార్పొరేట్ లాభదాయకత,  వ్యక్తుల ఆదాయానికి సూచిక అయిన అడ్వాన్స్ టాక్స్ విలువ ఈ ఏడాది ఏప్రిల్ 1-–జూన్ 195 మధ్య 3.87 శాతం తగ్గి రూ.1.56 లక్షల కోట్లకు చేరుకుంది. 

2024లో ఇదే కాలంలో, ముందస్తు పన్ను వసూళ్లు 27 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. కార్పొరేట్లు చెల్లించిన ముందస్తు పన్ను 5.86 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేట్లు కాని వ్యక్తులు, హెచ్​యూఎఫ్​లు, సంస్థల నుంచి వసూళ్లు 2.68 శాతం తగ్గి రూ.33,928 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.