గచ్చిబౌలి, వెలుగు: రాష్ర్ట హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే నియమించిన అడ్వకేట్ కమిషనర్ల కమిటీ గురువారం శేరిలింగంపల్లి మండల పరిధిలోని చెరువులను పరిశీలించింది. చెరువుల ఆక్రమణ, శిఖం స్థలం, చెరువుల స్థితిగతులపై అడ్వకేట్ కమిషనర్లు నివేదికను సీల్డ్ కవర్లో హై కోర్టుకు సమర్పించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు చెరువుల ఆక్రమణపై ప్రభుత్వేతర ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్అనిల్ సి. దయాకర్ హై కోర్టులో కంప్లైంట్ చేశారు. హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లోని 16 చెరువుల స్థితిగతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఫిబ్రవరి6 న ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అధారే ఆదేశాల మేరకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రవీణ్కుమార్, ప్రభుత్వ రెవెన్యూ ప్లీడర్ టి. శ్రీకాంత్రెడ్డిలను చెరువుల పరిశీలన కోసం నియమించింది.
