బీజేపీ సంస్థాగత అబద్ధాలు చెబుతోంది

బీజేపీ సంస్థాగత అబద్ధాలు చెబుతోంది

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై పలుమార్లు కేంద్రాన్ని విమర్శించిన రాహుల్ గాంధీ ఆదివారం మరోసారి మండిపడిన సంగతి తెలిసిందే. కేంద్ర సర్కార్ పిరికి చర్యల వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాహుల్ దుయ్యబట్టారు. అలాగే కేంద్ర వ్యవహార శైలి చైనా మనోధైర్యాన్ని మరింత పెంచుతుందని మండిపడ్డారు. ఇవ్వాళ కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకొని రాహుల్ గాంధీ మరో ట్వీట్ చేశారు.

‘బీజేపీ సంస్థాగత అబద్ధాలు చెబుతోంది. వీటిలో కరోనా టెస్టులను నియంత్రించడం, మరణాలపై తప్పుడు నివేదికలు ఇవ్వడం, జీడీపీని కొత్త పద్ధతిలో లెక్కించడం, చైనా దూకుడు విషయంలో మీడియాను భయపెట్టడం ఉన్నాయి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఇండో–చైనా సరిహద్దు వివాదం, కరోనా మహమ్మారి, ఇండియా ఎకానమీపై కేంద్ర సర్కార్‌‌తోపాటు ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌గా చేసుకొని రాహుల్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.