రైతుల బాగు కోసమే వ్యవసాయ చట్టాలు

రైతుల బాగు కోసమే వ్యవసాయ చట్టాలు

వ్యవసాయం లాభసాటి చేసేందుకే కొత్త చట్టాలు తెచ్చామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి.. రైతుల బాగు కోసమే వ్యవసాయ చట్టాలు తెచ్చామన్నారు. నిరసనల్లో రైతులు కాదు..పార్టీలున్నాయని..రైతులు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడంలేదన్నారు. రైతులు స్వేచ్చగా ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులతో సంబంధం లేకుండా నిరసనలు జరుగుతున్నాయన్నారు. సన్నాలు సాగు చేయమని చెప్పి.. కేసీఆర్ రైతులను నిండా ముంచారని..  రేపటి బంద్ కు రైతులు సహకరించొద్దన్నారు. రైతు రుణమాఫీ ఇవ్వని కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని బంద్ కు పిలుపునిచ్చారో చెప్పాలన్నారు కిషన్ రెడ్డి.