- సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్గా విధులు నిర్వహించాలని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ డైరెక్టర్డాక్టర్ గోపికి స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీజీఎస్ఓసీఏ) డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు. ఇప్పటి వరకు టీజీఎస్ఓసీఏ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ కేశవులును అగ్రికల్చర్ వర్సిటీకి రీపట్రియేట్ చేస్తున్నట్టు ఆదేశాలిచ్చారు.
డాక్టర్ కేశవులు 2015లో టీజీఎస్ఓసీఏ డైరెక్టర్గా నియమితులయ్యారు. అనంతరం 2016, 2020లో జారీ చేసిన జీవోల ద్వారా ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. అయితే, డాక్టర్ కేశవులు పదవీకాలం నవంబర్ 25న ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అగ్రికల్చర్ డైరెక్టర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
