జూన్ 18న మంత్రులతో ముఖాముఖికి తుమ్మల

జూన్ 18న మంత్రులతో ముఖాముఖికి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్‌‌లో బుధవారం జరగనున్న 'మంత్రులతో ముఖాముఖి' కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరగనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. 

కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొని, తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా మంత్రికి అందజేయవచ్చని సూచించాయి.  ప్రజల సమస్యలను నేరుగా వినడం, పరిష్కరించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు' అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పీసీసీ పేర్కొంది.