
అహ్మదాబాద్: గుజరాత్ విమాన ప్రమాదంపై విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి శనివారం ఉదయం ఎన్ఐఏ బృందం వెళ్లి పరిశీలించింది. అయితే.. ఆ సమయంలో శిథిలాల కింద మరో మృతదేహం అధికారులకు కనిపించింది. కుట్ర కోణం ఉందేమోనన్న కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఐడెంఫికేషన్ కోసం ఈ ప్రమాదంలో చనిపోయిన వారి డీఎన్ఏ శాంపిల్స్ను ఇప్పటికే ల్యాబ్కు పంపించారు. ఇప్పటికి దాదాపు 200 డీఎన్ఏ శాంపిల్స్ను సేకరించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల సంఖ్య275కు చేరింది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్పై విమానం కూలడంతో ఆ హాస్టల్లో ఉన్న 34 మంది కూడా ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.
270 మృతదేహాలకు సివిల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయింది. 220 మంది డీఎన్ఏ శాంపిల్స్ను సేకరించారు. ఏడు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. 8 ఏజెన్సీలు ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నాయి. ఎన్ఐఏ (NIA), గుజరాత్ పోలీస్, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), యునైటెడ్ కింగ్డమ్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (UK--AAIB), యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటిదాకా 275 మంది చనిపోగా.. ఇందులో 241 మంది విమానంలో ఉన్న వారు, 34 మంది మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న వాళ్లు కావడం గమనార్హం.
ఇక.. ఈ విమాన ప్రమాద కారణాలపై నిపుణులు చెప్పిన విషయం ఏంటంటే.. ఒక ఇంజన్ ఫెయిల్ అయి పొరపాటుగా ల్యాండింగ్ గేర్లను రిట్రాక్ట్ (ఉపసంహరణ) చేయడం మరిచిపోయి ఉండొచ్చు. ఏకకాలంలో 2 ఇంజన్లు ఫెయిల్ అయి ప్రమాదం జరిగి ఉండొచ్చు. టేకాఫ్ ఫ్లాప్స్ రాంగ్ పొజిషన్లో ఉండి ఉండొచ్చు. విమానం 400 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయినట్టు గుర్తించిన పైలట్లు.. పొరపాటుగా దానికి బదులుగా పని చేస్తున్న ఇంజన్ను షట్ డౌన్ చేసి ఉండొచ్చు. ఇలాంటి పొరపాట్లు విమానయాన చరిత్రలో అనేకం జరిగాయి. కారణం ఏదైనప్పటికీ.. సడెన్గా థ్రస్ట్ను కోల్పోవడమే విమానం కూలిపోవడానికి దారి తీసిందని నిపుణులు చెప్తున్నారు. ఏదో ఒక కారణం వల్ల విమానం అకస్మాత్తుగా థ్రస్ట్ను కోల్పోయి ఉంటుందని, అలాంటి క్లిష్టమైన పరిస్థితులను పైలట్లు హ్యాండిల్ చేసే క్రమంలో పొరపాట్లు జరిగి, చివరకు ప్లేన్ కూలిందని భావిస్తున్నారు.