మోదీ, కేసీఆర్​చెప్పేవన్ని అబద్ధాలే :మల్లికార్జున్ ఖర్గే

మోదీ, కేసీఆర్​చెప్పేవన్ని అబద్ధాలే :మల్లికార్జున్ ఖర్గే
  • ఇద్దరూ ధనవంతులకే కొమ్ముకాస్తున్నరు
  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

హైదరాబాద్: పీఎం మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్​షోలో ఆయన మాట్లాడారు.

‘బిడ్డ కోసమే కేసీఆర్‌ మోదీతో చేతులు కలిపిండు. ఇద్దరూ ధనవంతులకే కొమ్ముకాస్తున్నరు. పేదలను మరింత పేదలుగా చేస్తున్నరు. పేదల ఖాతాల్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా? రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ చెప్పారు.. చేశారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారు.. ఇచ్చారా? ఆప్‌ సర్కారుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమ్మక్కయ్యారు.

ఆయన ఆప్‌తో మద్యం స్కామ్‌లో పాలుపంచుకున్నారు.  కాంగ్రెస్‌ తెచ్చిన పరిశ్రమలను కేంద్ర సర్కారు అమ్ముకుంటోంది. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్‌ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది. బీఆర్ఎస్ సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచింది’ అని అన్నారు.