నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రచారం

నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రచారం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని జహీరాబాద్‌, వనపర్తి, హుజూర్‌నగర్‌లలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే బహిరంగ సభలలో ఆయ‌న హాజరై ప్రసంగించనున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌భ‌ల‌కు రాష్ట్ర కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్ర‌చార నేప‌థ్యంలో రాహుల్ గాంధీ గ‌త రాత్రే హైద‌రాబాద్ చేరుకున్నారు. పార్టీ శ్రేణుల స‌మాచారం మేర‌కు రాహుల్ గాంధీ ఈ ఉదయం 11 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రాయం నుంచి జహిరాబాద్ కు బయలుదేరనున్నారు. జ‌హిరాబాద్‌ సమీపంలోని పస్తాపూర్‌ హెలిప్యాడ్‌కు చేరుకొని అక్క‌డి బహిరంగసభలో ప్రసంగిస్తారు. 1.45 గంటలకు వనపర్తి చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్‌లో జరగనున్న సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు.