
హైదరాబాద్, వెలుగు: ఇద్దరు పేద విద్యార్థినుల ఉన్నత చదువుల ఫీజులు చెల్లించేందుకు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ముందుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ఏ స్మైల్లో భాగంగా వారిద్దరికి రూ.లక్ష చొప్పున చెక్కులు ఆదివారం అందజేశారు. ఎంజీ వర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము సుమతి, మీర్పేటలోని టీకేఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మల్లెపాక శ్వేత చదువు పూర్తయ్యేవరకు రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తానని తెలిపారు. పేదరికం వల్ల చదువుకు దూరం కావొద్దనే వారి ఫీజులు చెల్లిస్తున్నానని తెలిపారు.