హైదరాబాద్, వెలుగు: దేశంలోనే మొదటిసారిగా పల్స్ సెలెక్ట్ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ (పీఎఫ్ఏ) ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్టు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (ఏఎఫ్) ఉన్నవారిలో గుండె పై గదులు గందరగోళంగా, చాలా వేగంగా కొట్టుకుంటాయి. ఈ సమస్యను సరిచేయడానికి వైద్యులు చేసే ప్రక్రియే అబ్లేషన్ .
ప్రస్తుతం అబ్లేషన్ కోసం గుండెలోని కణజాలాన్ని వేడి చేయడం లేదా గడ్డకట్టేంత చల్లబరుస్తున్నారు. ఇది సమర్థవంతమే అయినా, ఒక్కోసారి పక్కనే ఉన్న అవయవాలకు గాయం అయ్యే చిన్న ప్రమాదం ఉండేది. పీఎఫ్ఏ వేడిని లేదా చలిని ఉపయోగించదు. చాలా వేగంగా పనిచేసే విద్యుత్ తరంగాలను పంపిస్తుంది. ఇది గుండెలోని అసాధారణ లయకు కారణమయ్యే కణజాలాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని ఏఐజి డాక్టర్ నరసింహన్ వివరించారు.
