తెలంగాణలోనూ జల్దీఎయిర్ ఇంటర్నెట్​ సేవలు

తెలంగాణలోనూ  జల్దీఎయిర్ ఇంటర్నెట్​ సేవలు

హైదరాబాద్​, వెలుగు: ​తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరల్లో ఇంటర్నెట్ ఇవ్వడానికి  మైక్రోసాఫ్ట్​, జల్దీఎయిర్ చేతులు కలిపాయి. ప్రైవేట్​, పబ్లిక్​, నాన్​ ప్రాఫిట్​ సెక్టార్లతో కలిసి హైస్పీడ్​ నెట్ సేవలు అందించేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో  ఎయిర్‌జల్డీ నెట్‌వర్క్‌ కొత్తగా -తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలకు నెట్ సేవలను అందిస్తుంది. దీంతో ఎయిర్​జల్దీ సేవలు అందించే రాష్ట్రాల సంఖ్య  12కు చేరుతుంది.

నెట్‌వర్క్ లొకేషన్లను 40 నుండి 62కి పెంచుతుంది.  అదనంగా1,500 కిలోమీటర్ల ఫైబర్ నెట్‌వర్క్​నిర్మించడం వల్ల 20 వేల చదరపు కిలోమీటర్ల మేర నెట్​ సేవలు అందించవచ్చు. ఫలితంగా దాదాపు ఐదు లక్షల మంది గ్రామీణ పేదలకు ఇంటర్నెట్ యాక్సెస్‌ వస్తుంది. వైర్‌లెస్,  వైర్డ్​ మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా తొమ్మిది రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు నెట్​ ఇస్తున్నామని తెలిపింది.  ఈ రెండు సంస్థలు కలిసి రూరల్​ కనెక్టివిటీని పెంచడంతోపాటు 15 వేల మంది మహిళలను, యువతను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడానికి స్కిల్స్​ నేర్పిస్తాయి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్​ టెక్నాలజీలను ఉపయోగిస్తారు.