రూ.26 వేల కోట్ల సింగరేణి బకాయిలు చెల్లించాలి : వి.సీతారామయ్య

రూ.26 వేల కోట్ల సింగరేణి బకాయిలు చెల్లించాలి : వి.సీతారామయ్య

ఏఐటీయూసీ ప్రెసిడెంట్​వి.సీతారామయ్య డిమాండ్

గోదావరిఖని, వెలుగు : బొగ్గు, విద్యుత్​ను​వాడుకున్నందుకు సింగరేణికి ఇవ్వాల్సిన రూ.26 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే  చెల్లించాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్​ ప్రెసిడెంట్​ వి.సీతారామయ్య డిమాండ్​చేశారు. గురువారం జీడీకే 11 గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. సంస్థ సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న శ్రద్ధ  కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులకు లేదని విమర్శించారు. 

బకాయి సొమ్మును చెల్లిస్తే సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించే చాన్స్ ఉందని, తద్వారా ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు.  సింగరేణి లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్​ల రద్దుకు దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీటింగ్​లో లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, రంగు శ్రీనివాస్, అక్బర్ అలీ, ఎస్​.వెంకట్ రెడ్డి, సిద్దమల్ల రాజు, ఎం.చక్రపాణి పాల్గొన్నారు.