రన్ వే 34పై రకుల్

రన్ వే 34పై రకుల్

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో బిజీ అయిపోయిన రకుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీత్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాటిలో ‘మే డే’ ఒకటి. అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవగణ్ హీరోగా నటిస్తూ దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రమిది. అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ నెలలో రిలీజవ్వాల్సింది. కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చే ఏప్రిల్ 29న విడుదల చేయడానికి టీమ్ డిసైడయ్యింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చిత్రానికి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను చేంజ్ చేశారు. 

‘రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే 34’ అనే పేరు పెట్టినట్టు నిన్న ప్రకటించారు. ఇదో హై ఆక్టేన్ థ్రిల్లర్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశాడు అజయ్. కథ మొత్తం ఎయిర్ లైన్స్ చుట్టూ తిరుగుతుంది. అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో పాటు రకుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పైలట్ గా కనిపించబోతోంది. అమితాబ్ పాత్రను రివీల్ చేయకుండా దాచిపెట్టారు. ఆయన క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ గా ఉంటుందని ఊరిస్తున్నారు. యు మి ఔర్ హమ్, శివాయ్ చిత్రాల తర్వాత అజయ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపై ఉంది.