మహా మలుపు: ఎన్​సీపీపై అజిత్​పవార్ తిరుగుబాటు

మహా మలుపు: ఎన్​సీపీపై అజిత్​పవార్ తిరుగుబాటు

మహారాష్ట్ర రాజకీయాలు కీలకమలుపు తిరుగుతున్నాయి. ఎల్​వోపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత, మహారాష్ట్ర నాయకుడు అజిత్ పవార్ ఆదివారం హసన్ ముషారఫ్‌తో సహా 29 మంది ఎన్​సీపీ  ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది. 

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు, సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.  పార్టీ రాష్ట్ర  చీఫ్ పదవిని తిరస్కరించడం పట్ల పవార్ కలత చెందారనే వాదనలు బలపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పూణేలో ఉన్నారు.