హైదరాబాద్, వెలుగు : సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ 2023 జులై 03 సోమవారం హైదరాబాద్కు రానున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అవుతారని తెలిసింది. జాతీయ రాజకీయాలు, యూనిఫాం సివిల్కోడ్, వచ్చే సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. కేసీఆర్, అఖిలేశ్సహా ఇతర నేతలు ప్రగతి భవన్లోనే లంచ్చేస్తారని, ఆ తర్వాత ఆయన తిరిగి యూపీకి తిరిగి వెళ్లిపోతారని బీఆర్ఎస్వర్గాలు తెలిపాయి.