ఇవాళ హైదరాబాద్​కు అఖిలేశ్​యాదవ్

ఇవాళ హైదరాబాద్​కు అఖిలేశ్​యాదవ్

హైదరాబాద్, వెలుగు : సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్​ యాదవ్​ 2023 జులై 03 సోమవారం హైదరాబాద్​కు రానున్నారు. ప్రగతి భవన్​లో  సీఎం కేసీఆర్​తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అవుతారని తెలిసింది. జాతీయ రాజకీయాలు, యూనిఫాం సివిల్​కోడ్, వచ్చే సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. కేసీఆర్, అఖిలేశ్​సహా ఇతర నేతలు ప్రగతి భవన్​లోనే లంచ్​చేస్తారని, ఆ తర్వాత ఆయన తిరిగి యూపీకి తిరిగి వెళ్లిపోతారని బీఆర్ఎస్​వర్గాలు తెలిపాయి.