దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్లో మారేష్ శివన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. దినేష్ తేజ్ మాట్లాడుతూ ‘నేను నటించిన ‘హుషారు’ చిత్రానికి మారేష్ శివన్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేశారు.
ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నాడు. మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది హెబ్బా పటేల్. మంచి టీమ్తో పని చేయడం ఆనందంగా ఉంది అంది పాయల్. మారేష్ శివన్ మాట్లాడుతూ ‘దినేష్ ఇందులో సహజంగా నటించాడు.
హెబ్బా పటేల్ సెకెండాఫ్ను భుజాల మీద మోసింది. ఎంతో మెచ్యూర్డ్ రోల్ను పోషించింది. లవ్, కెరీర్ మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం’ అని చెప్పాడు. ‘ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ’ అన్నాడు నిర్మాత. టీమ్ అంతా పాల్గొన్నారు.