
వసంత్, భాగ్యలక్ష్మి, రమ్య హీరో హీరోయిన్లుగా దర్శకుడు టి.రాము రూపొందిస్తున్న సినిమా ‘అలలు లేని సముద్రం’. రాం రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన నిర్మాతలు బాలాజీ నాగలింగం, రామశర్మ, కర్నూలు బీజేపీ లీడర్ సుబ్బారెడ్డి సినిమా సక్సెస్ సాధించాలని కోరారు. దర్శకుడు రాము మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అక్టోబర్, నవంబర్లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పాడు. నటి రోజారాణి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.