గ్రూప్ 1 పరీక్ష రద్దు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు: రేవంత్రెడ్డి

గ్రూప్ 1 పరీక్ష రద్దు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు: రేవంత్రెడ్డి

కేసీఆర్ పాలనలో అన్నీ లీకేజీలే అని.. గ్రూప్ 1 పరీక్ష రద్దు ప్రభుత్వానికి చెంపపెట్టు అని.. ప్రభుత్వం చేతగానితనానికి  గ్రూప్ 1 రద్దు నిదర్శనమని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షల్లో  లీకేజీలతో రద్దు అవుతున్నాయి.. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.  

లీకేజీలతో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే అధికారం సీఎం కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి సిగ్గుంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల సమస్యల పట్ల ఎన్ ఎస్ యూఐ చేపట్టే నిరసన కార్యక్రమాలకు యువత పాల్గొనాలని పిలుపు నిచ్చారు రేవంత్ రెడ్డి. 

ఇతర పార్టీలనుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని.. అభ్యర్థుల ఎంపికపై  స్ర్కీనింగ్ కమిటీలో చర్చించామని.. నియోజకవర్గాల వారీగా వచ్చిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి ఏకాభిప్రాయానికి వచ్చాం.. త్వరలో అభ్యర్థులను ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.