హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తం : పీసీసీ వైస్ ​ప్రెసిడెంట్​ నిరంజన్​

హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తం : పీసీసీ వైస్ ​ప్రెసిడెంట్​ నిరంజన్​

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ప్రకటించిన హామీలన్నింటిని దశలవారీగా అమలు చేస్తామని పీసీసీ సీనియర్​వైస్​ ప్రెసిడెంట్​జి. నిరంజన్ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యానికి సీఎం రేవంత్​ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పా రు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీల అమలును స్టార్ట్​ చేశామన్నారు. కేవలం 5 రోజుల పాలనలోనే రాష్ట్రంలో  గుణాత్మక మార్పు కనిపిస్తున్నదని, దాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని వెల్లడించారు.

మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మా ట్లాడారు. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచడంతో సామాన్యులకు భరోసా పెరిగిందని నిరంజన్ తెలిపారు. హామీ ప్రకారం రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.