హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ప్రకటించిన హామీలన్నింటిని దశలవారీగా అమలు చేస్తామని పీసీసీ సీనియర్వైస్ ప్రెసిడెంట్జి. నిరంజన్ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పా రు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీల అమలును స్టార్ట్ చేశామన్నారు. కేవలం 5 రోజుల పాలనలోనే రాష్ట్రంలో గుణాత్మక మార్పు కనిపిస్తున్నదని, దాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని వెల్లడించారు.
మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మా ట్లాడారు. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచడంతో సామాన్యులకు భరోసా పెరిగిందని నిరంజన్ తెలిపారు. హామీ ప్రకారం రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.