
ఆళ్లపల్లి, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. మర్కోడ్ మాజీ ఉపసర్పంచ్ కుర్ర కమల చేసిన పనులకు సంబంధించిన పెండింగ్బిల్లులు పాస్ చేయడానికి ఎంపీవో బత్తిన శ్రీనివాస్, మర్కోడ్ పంచాయతీ కార్యదర్శి నాగరాజు రూ.15 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం మండల పరిషత్ఆఫీసులో కమల నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటున్న శ్రీనివాస్, నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల ఇద్దరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ రమేశ్ తెలిపారు.