GHMC ఎన్నికల్లో ఓంటరిగానే పోటీ చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . ఈ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని చెప్పారు. జనసేనతో పాటు ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తమ పార్టీ ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన చెప్పారు. పొత్తుల విషయంలో ఇప్పటివరకు కూడ ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు.
అంతేకాదు ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని…మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు.