
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల్లో అల్లు అర్జున్ అతిథిగా పాల్గొనబోతున్నాడు. ఇండస్ట్రీ ప్రముఖులు భరత్ భూషణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, అనుపమరెడ్డి, శివబాలాజీ, ముత్యాల రామదాసు తదితరులు అల్లు అర్జున్ను కలసి ఆహ్వానించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో జరగనున్న ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొనబోతున్నారు.
ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఇదే వేడుకకు సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.
బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.ఇలా ఒకే వేదిక పై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి కనిపించనున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.