
‘తగ్గేదే లే’ అంటూ పుష్పరాజ్గా నేషనల్ అవార్డు అందుకోవడంతో పాటు పాన్ వరల్డ్ స్థాయిలోనూ గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో తన మేనరిజమ్స్ని.. సామాన్యుడు నుంచి సెలెబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ రీ క్రియేట్ చేశారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా మరో ల్యాండ్ మార్క్ను క్రియేట్ చేశాడు బన్నీ.
ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్ విషయంలో రేర్ రికార్డును నెలకొల్పాడు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్గా ఉండే అల్లు అర్జున్ 25 మిలియన్ల ఫాలోవర్స్ను చేరుకున్నాడు. ఇన్స్టాలో ఇంత మంది ఫాలోవర్స్ ఉన్న మొదటి సౌత్ హీరో బన్నీనే. దీనిపై స్పందిస్తూ ‘మీ అభిమానానికి ఎప్పటికీ థ్యాంక్స్’ అంటూ పోస్ట్ను పెట్టాడు అల్లు అర్జున్.
తమ హీరో క్రియేట్ చేసిన రికార్డు విషయంలో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక తను ప్రస్తుతం ‘పుష్ప 2’మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ‘పుష్ప’ ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుందని ఇటీవల బన్నీ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.